అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామంలో యువకుడుని హత్య చేసి చంపారు. దుండగులు వేట కొడవలితో వెంటాడి, వేటాడి దాడి చేసి దారుణంగా హత్య చేశారు. స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నాపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతిడి కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి.