కరోనా వైరస్ మహమ్మారి బ్రెజిల్ దేశాన్ని వీడటం లేదు. బ్రెజిల్ దేశంలో సోమవారం ఒక్కరోజే 39,846 కరోనా కేసులు వెలుగుచూడగా, 827 మంది మరణించారు. అమెరికా దేశం తర్వాత కరోనా మరణాల్లో బ్రెజిల్ రెండోస్థానంలో నిలిచింది. కరోనా కేసుల నమోదులో అమెరికా, భారత్ తర్వాత బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. బ్రెజిల్ దేశంలో మొత్తం 1,74,52,612 కరోనా కేసులు నమోదైనాయి. కరోనా కేసుల సంఖ్య పెరగటంతో బ్రెజిల్ దేశంలో చికిత్స చేసేందుకు ఆసుపత్రుల్లో పడకలు కరువైనాయి. కరోనా రోగులతో బ్రెజిల్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. బ్రెజిల్ దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు 78 మిలియన్ల మందికి కొవిడ్ టీకాలు వేశారు. కరోనా కట్టడికి బ్రెజిల్ దేశం చర్యలు తీసుకుంటున్నా, మరణాలు మాత్రం ఆగటం లేదు.