ఓ మహిళ ఇద్దరితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన ఓ ప్రియుడు ఆమె పై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చిలిపాాలెంకు చెందిన మహిళకు గోపి అనే వ్యక్తితో వివాహేతరం సంబంధం ఉండేది. అదే సమయంలో సుభాని అనే మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో గోపిని దూరం పెట్టింది. మహిళ దూరం పెట్టడానికి కారణం సుభానీ అని గోపి అతని పై కోపం పెంచుకున్నాడు. దీంతో కోపం పెంచుకున్న గోపి అర్దరాత్రి వేళ సుభాని పై కత్తితో దాడి చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అడ్డుకొని సుభానిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.