ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా బారినపడిన మరో ఎమ్మెల్యే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 02:50 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పెద్దసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులను ఈ మధ్య కాలంలో అధికంగా మహమ్మారి చుట్టుముడుతున్నది. తాజాగా కర్నూలు జిల్లాలోని పత్తికొండ ఎమ్మెల్యే కే. శ్రీదేవి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. వైరస్ లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయించుకోగా.. అందులో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పారు. గత ఐదు రోజులుగా తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని కోరారు.


రాష్ట్రంలో నిన్న 22,164 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 93 మంది బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,87,603కి చేరగా, 8,707 మంది మరణిచారు. మరో 1,90,632 కేసులు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 10,88,264 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com