ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 09:41 AM

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఈ విషాదఘటన చోటుచేసుకుంది. ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్‌ చినమస్తాన్‌ కుటుంబంతో బైక్ వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో అతనితో పాటు ఆయన భార్య, కుమారుడు తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. మృతులను ఫిరంగిపురం మండలం తాళ్లూరుకు చెందిన షేక్‌ చినమస్తాన్‌, ఆయన భార్య నూర్జహాన్‌, కుమారుడు హుస్సేన్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com