కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా వరకు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ప్రోనింగ్ అనే పద్దతి అనుసరించి ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రోనింగ్ పద్ధతిని అనుసరించి ఓ 82 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గోరఖ్పూర్ జిల్లాలోని అలీనగర్ ప్రాంతానికి చెందిన 82ఏళ్ల విద్య శ్రీవాస్తవకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతోంది. ఆమె ఆక్సిజన్ స్థాయి 79 కి పడిపోయింది. అయితే ప్రోనింగ్ మెథడ్ అనుసరించడం ద్వారా నాలుగు రోజుల్లోనే ఆక్సిజన్ లెవెల్స్ 94 కు చేరాయని ఆమె కుమారుడు చెప్పాడు. విద్య శ్రీవాస్తవ 12 రోజుల్లోనే కరోనాను జయించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది.