ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు చస్తుంటే సీఎం ఐపీఎల్ తో కాలక్షేపం: దేవినేని ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 30, 2021, 02:20 PM

సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళగిరి సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన కేసులో చంద్రబాబు పేరు చెబితే మధ్యాహ్నం లోగా మిమ్మల్ని వదిలేస్తామని సీఐడి అధికారులు తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. తన ప్రమేయం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా స్టేట్ మెంట్లు రాసుకుని వాటిపై తన సంతకాలు చేయాలని దర్యాప్తు అధికారులు బెదిరించినట్లు చెప్పారు. తప్పుడు కేసులతో ముఖ్యమంత్రి జగన్ నా గొంతు నొక్కాలనుకుంటున్నాడు. అక్రమ కేసులకు నేను భయపడను అని అన్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే సీఎం జగన్ మాత్రం తాడేపల్లిలో కుర్చుని ఐపీఎల్ మ్యాచ్ లు, సినిమాలు చూస్తూ కాలక్షేమం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ మెప్పు కోసం కొంత మంది అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com