కేరళలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.