బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దైంది. భారత్ లో కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ప్రధాని కార్యాలయం, భారత ప్రభుత్వం సంయుక్త ప్రకటన వెలువరించాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే వారం బోరిస్ జాన్సన్ ఇండియాలో పర్యటించాల్సి ఉంది. కాగా ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఆయన హాజరు కావాల్సి ఉండగా కరోనా కారణంగా నాటి పర్యటన వచ్చే వారానికి వాయిదా పడింది. తాజాగా మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నారు.