ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5,963 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా నుంచి 2569 మంది కోలుకున్నారు. మరో 27 మంది కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,000కు చేరింది. ఇప్పటివరకు 9,12,510 మంది కోలుకోగా.. ప్రస్తుతం 48,053 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 7,437 మంది మరణించారు.