భారత్ లో గత 24 గంటల్లో 22,771 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 3,94,226 మంది కోలుకోగా 18,655 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 2,35,433 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 442 మంది చనిపోయారు.భారత్ లో గత 24 గంటల్లో 22,771 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 3,94,226 మంది కోలుకోగా 18,655 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 2,35,433 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 442 మంది చనిపోయారు.కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ పై తన వాఖ్యలను ఎక్కుపెట్టారు. అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేస్తూ దాన కర్ణుడు అనిపించుకుంటున్న సీఎం జగన్ కు కాపు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయంలో కాపు జాతి మద్దతు ఉందని ముద్రగడ అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం సమంజసమైనదని జగన్ గతంలో చెప్పారని గుర్తు చేశారు.పదవిని మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. తమ జాతి సమస్యను తీర్చాలని ప్రధాని మోదీని కోరాలని సీఎం జగన్ను పద్మనాభం కోరారు. మొత్తానికి కాపు రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వాన్ని ముద్రగడ పద్మనాభం మొదటిసారిగా ఈ స్థాయిలో డిమాండ్ చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. పద్మనాభం ఇంతటితో ఆగుతారా లేక మరోసారి ఉద్యమం చేస్తారా అన్న అంశం ఆసక్తిగా మారింది.