ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో కరోనా విజృంభణ.. కొత్తగా 22,771 కేసులు, 442 మరణాలు!

national |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 11:41 AM

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 22,771 కరోనా కేసులు నమోదయ్యాయి.
అలాగే కరోనా కారణంగా 442 మంది మరణించారు. దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 18,655గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,35433 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 3,94,227 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com