గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సై తనను మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ముప్పాళ్ల ఎస్సైగా ప్రస్తుతం జగదీశ్ పని చేస్తున్నాడు. నరసరావుపేటకు చెందిన సింధు అనే మహిళ 2013లో భర్తతో విబేధాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో నరసరావుపేట ఎస్సైగా జగదీశ్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సింధుకు, జగదీశ్ కు పరిచయం ఏర్పడింది. భర్తకు విడాకులు ఇస్తే తాను పెళ్లి చేసుకుంటానని జగదీశ్ ఆమెను నమ్మించాడు.అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం ద్వారా సింధుకు ఓ బాబు కూడా జన్మించాడు. 2017లో జగదీశ్ సింధును రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం జగదీశ్ నుంచి తనకు ముప్పు ఉందని తనను,తన కుమారుడిని చంపేస్తానని బెదిరిస్తున్నాడని సింధు నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరింది.