ప్రధాని మోడీ దూకుడు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన ఆకస్మికంగా లఢఖ్ చేరుకున్నారు. అక్కడ గాయపడ్డ జవాన్లను పరామర్శించారు. ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సైనికుల్లో ఆత్మస్తైర్యం నింపారు. లడఖ్లో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. గాల్వన్ ఘటనలో గాయపడి లేహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ఆయన పరామర్శించారు.