ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కార్పొరేషన్ ను సీఎం జగన్ ప్రారంభించారు. 50,449 మందికి సీఎం జగన్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇస్తామని సీఎం జగన్ అన్నారు. గతంలో ఉద్యోగాలు,జీతాల కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడా పరిస్థితి లేదని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లిస్తామన్నారు. అదే విధంగా ఉద్యోగాల సంఖ్యను మరింత పెంచుతామని సీఎం జగన్ అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వివిధ ఏజన్సీల ద్వారా భర్తీ చేసేవారు. అదే విధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా వచ్చేవి కావు. దీంతో సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో అవినీతి జరగకూడదని, అదే విధంగా ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసమే ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. దానిని నేడు ప్రారంభించి ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు అధికారికంగా నియామక పత్రాలు అందజేశారు.