తన 15 మంది భార్యల కోసం రూ.175 కోట్ల రూపాయలతో 19 రోల్స్ రాయిస్ కార్లను కొన్నాడు. అయన ఎవరో కాదు స్వాజిలాండ్ దేశాన్ని పాలిస్తున్న రాజు మస్వతి III. ఆఫ్రికా ఖండంలో అక్కడక్కడా ఇప్పటికే రాచరిక వ్యవస్థలు కనిపిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి స్వాజిలాండ్. ఆ దేశంలో రాజుదే అధికారం. అయన చెప్పిన విధంగానే అక్కడ ప్రభుత్వాలు నడుస్తాయి. అసలే పేదదేశం, నిరుద్యోగ సమస్యతో దేశం అల్లాడుతున్నది. అయినప్పటికీ రాజు అవేమి పట్టించుకోవడం లేదట. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో సగానికి పైగా తన కుటుంబ ఖర్చులకు, విలాసవంతమైన జీవితానికే ఖర్చు చేస్తున్నారని అక్కడి నాయకులు వాపోతున్నారు. అధికారం రాజు చేతుల్లో ఉన్నది కాబట్టి ఏమి చేయలేకపోతున్నామని అంటున్నారు. రాజుగారి ఇంటి గ్యారేజ్ మొత్తం కార్లతో నిండిపోయిందని, అయినప్పటికి కొత్త కార్లు కొంటూనే ఉన్నారని, ఆ డబ్బును ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తే ప్రజలు సంతోషిస్తారని అంటున్నారు. సోషల్ మీడియాలో భార్యల కోసం స్వాజిలాండ్ రాజు కొనుగోలు చేసిన కార్లు వైరల్ కావడంతో, నెటిజన్లు ఆ దేశ రాజుపై మండిపడుతున్నారు.