ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 24, 2020, 03:19 PM

ఏపీలో గత 24 గంటల్లో 448 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,331కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4779 మంది కోలుకొని డిశ్చార్జు కాగా 129 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5423 కరోనా కేసులున్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 10మంది చనిపోయారు. కర్నూల్ లో 4,కృష్ణాలో 3,గుంటూరులో 2, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 1028,చిత్తూరు 657,తూర్పుగోదావరి 760,గుంటూరు 891,కడప 478,కృష్ణా 1132,కర్నూల్ 1483,నెల్లూరు 493,ప్రకాశం 200,శ్రీకాకుళం 60,విశాఖపట్నం 367,విజయనగరం 94,పశ్చిమ గోదావరి జిల్లాలో 663 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 1661 మందికి రాగా ఇతర దేశాలకు చెందిన వారికి 364 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com