ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ కాపునేస్తం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 354 కోట్లు జమచేశారు. సంవత్సరానికి రూ.15 వేల చొప్పున అర్హుల ఖాతాలో రూ.75వేలు జమ కానున్నాయి. లబ్ధిదారులు ఇంతే కాదని, అర్హత ఉన్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హతల జాబితా ఉంటుందని, అవి చెక్ చేసుకొని తాము అర్హులమే అని భావిస్తే తప్పకుండా దరఖాస్తు చేసుకుంటే కాపు నేస్తం జాబితాలో చేరుస్తామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు.