క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. కానీ పోలీసులు సకాలంలో స్పందించి అతని ప్రయత్నాన్ని విఫలం చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. వివరాల్లోకెళితే.. ఏలూరు గన్బజార్కు చెందిన లీలావర ప్రసాద్ తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్పై నిలబడి సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోలను తన తల్లిదండ్రులకు పంపించాడు. వారు వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో అప్రమత్తమైన టూటౌన్ పోలీసులు హుటాహుటి గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే ట్రాక్పై ఉన్న లీలావరప్రసాద్ను గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అతన్ని తన తల్లిదండ్రులకు అప్పగించారు.