ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ భారత్లో త్వరలో ఐఫోన్ SE-2020ను ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతోంది. జూలైలో కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. తన ఆర్ఫోడబుల్ డివైస్ ఐఫోన్ SEని భారత్లో తయారు చేయాలని భావిస్తున్న సంస్థ త్వరలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ SE-2020 పై పని ప్రారంభించనుంది. ఐఫోన్ SEని భారత్ లో తయారు చేస్తే, ఫోన్ను దిగుమతి చేసుకోవడానికి కంపెనీ 20 శాతం అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో తక్కువ ధరకు యూసర్లకు ఈ ఫోన్ అందనుంది.ఆపిల్ యొక్క తైవానీస్ తయారీ ఒప్పందం విస్ట్రాన్ భారతదేశంలో తయారు చేయబోయే కొత్త ఐఫోన్ SE(2020) కోసం భాగాలను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిసింది. దిగుమతి పన్నును నివారించడానికి మరియు దేశంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి 2017 సంవత్సరంలో ఆపిల్ తన ఐఫోన్ మోడళ్లను ఇక్కడ తయారు చేయడం ప్రారంభించింది. అయితే, కంపెనీ ఇప్పటివరకు పాత ఐఫోన్ మోడల్ను మాత్రమే ఉత్పత్తి చేసింది. కొంతకాలం క్రితం ఆపిల్ తన ఆర్ఫోడబుల్ ఐఫోన్ SEని భారత మార్కెట్లో విడుదల చేయగా.. 64GB మోడల్ ధర రూ .42,500. 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ .47,800, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ .58,300గా ఉంది.