తిరుపతి సమీపంలో గంజాయి భారీగా పట్టుబడింది. తిరుపతి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికమొత్తంలో గంజాయి పట్టుబడింది. దాదాపు 500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. గంజాయిని తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ గంజాయికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.