ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో 3 లక్షల మార్క్ దాటిన కోరిన కేసులు...

national |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 01:15 PM

భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో చూస్తే అత్యథికంగా 10,974 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3 లక్షలకుపైగా పాజటీవ్ కేసులు నమోదు కాగా, 11,903మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,55,227 యాక్టివ్ కేసులు ఉండగా, 1,86,935 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాల విషయంలో భారత్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది.


భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. సగటున రోజుకు పదివేల కేసులకు పైగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3లక్షల 43వేల 91 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో  కరోనా రికవరీ రేటు 51 శాతంగా ఉంది.. ఇదిలా ఉండగా తాజాగా విడుదలయిన ఓ సర్వే.. భారతీయులను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది.. నెల రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలకు చేరకుంటుందని ఆ పరిశోధనలో స్పష్టమయింది..


భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు జనవరి 30న నమోదయింది. అప్పటి నుంచి జూన్ 15 వరకు.. 3లక్షల 43వేల 91 కరోనా కేసులు నమోదయ్యాయి. అంటే 138 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు మూడున్నర లక్షలకు చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com