దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు లక్షకు చేరువవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి మరోసారి లాక్డౌన్ను విధిస్తారని ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ట్విట్టర్ లో స్పందించారు. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ప్రజలు భౌతిక దూరంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సడలించిన లాక్డౌన్ను తిరిగి పునరుద్ధరింబోమని స్పష్టం చేశారు.