కర్నూలు జిల్లాలో కరోనాను జయించి శుక్రవారం 52 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం -783 మంది డిశ్చార్చ్ అయ్యారు కర్నూలు జిల్లా వారు 634, ఇతర రాష్ట్రాల వారు 149 మంది డిశ్చార్చ్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. డిశ్చార్చ్ అయిన కరోనా విజేతలకు రూ. 2000 లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.