భర్త తన స్నేహితులతో కలిసి భార్య పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కేరళలోని తిరువనంతపురానికి చెందిన వ్యక్తి భార్య,తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వ్యక్తి భార్యకు 25 సంవత్సరాలు. గురువారం సాయంత్రం ఆ వ్యక్తి భార్య,కొడుకును పుతుకురిచి వద్ద ఉన్న బీచ్ కు సరదాగా తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలో ఉన్న స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. భర్త సరదాగా తీసుకెళుతున్నాడని నమ్మి ఆమె వెళ్లింది. అక్కడ భార్యకు బలవంతంగా ఆ వ్యక్తి మద్యం తాపించాడు. అనంతరం తన కొడుకు ఎదుటే స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను సిగరెట్లతో కాల్చి హింసిస్తూ రాక్షసానందం పొందారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఆ చిన్నారి ఏడిస్తే అతనిని కూడా కొట్టారు. తన కొడుకును ఇంటి దగ్గర వదిలి వస్తానని ఆమె వారిని ప్రాధేయపడి అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం రోడ్డు పై మతిస్థిమితం లేని స్థితిలో ఆమె వెళుతుండగా ఓ కారు అతను చూసి ఆపి ఆమెకు సహాయం చేశాడు. ఆమె నుంచి వివరాలు తీసుకొని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో భార్యభర్తలకు విబేధాలు కూడా లేవు. బాధితురాలి భర్త ఇలా ఎందుకు ప్రవర్తించాడన్న దాని పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి నిందితుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిరువనంతపురం గ్రామీణ పోలీసు సూపరిండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. నిందితులకు గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఆయన అన్నారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ కేసు ఫైల్ చేసింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మహిళా కమిషన్ సభ్యురాలు షాహిదా కమల్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.