ఏపీ సర్కార్ విద్యార్దులకు మరో శుభవార్త చెప్పింది. ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్దులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. కరోనా ప్రభావంతో ఆన్ లైన్ లోనే క్లాసులు జరుగుతున్నాయి. విద్యార్దులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గురుకులాల సొసైటీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. రూ.5 వేల నుంచి రూ.6 వేలలోపు ఫోన్లను కొనుగోలు చేసి విద్యార్దులకు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో 60 వేల మంది విద్యార్దులున్నారు. ఈ నిర్ణయం పట్ల విద్యార్దులు హర్షం వ్యక్తం చేశారు. కేవలం క్లాసులకు మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.