స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరోసారి తన కస్టమర్లను హెచ్చరించింది. ఖాతాదారులు వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరేవారికి తెలియజేయవద్దని కోరింది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, అడ్రస్, సిగ్నేచర్ వంటి వివరాలు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడాలని సూచించింది. వీటిని ఎవరికైనా చెబితో రిస్క్లో పడాల్సి రావొచ్చని ఎస్బీఐ హెచ్చరించింది. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయం కావొచ్చని పేర్కొంది. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా మోసం జరిగితే వెంటనే ఆ విషయాన్ని బ్యాంక్ అధికారులకు తెలియజేయాలని సూచించింది.అలాగే ఎస్బీఐ తన కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. బ్యాంక్ మొబైల్ యాప్ను గూగుల్ ప్లేస్లోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. మోసపూరిత డిస్కౌంట్లు, ఆఫర్లతో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.