సాధారణంగా లోన్ తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్లాలి. అక్కడ అప్లికేషన్తోపాటు ఐడీ, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అందించాలి. లోన్ పొందాలంటే కచ్చితంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది పూర్తియిన తర్వాతనే మీకు లోన్ మంజూరు అవుతుంది. దీనికి కొన్ని రోజులు పట్టొచ్చు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు బ్యాంకుకు వెళ్లకుండానే లోన్ పొందొచ్చు. కాంటాక్ట్లెస్ లెండింగ్ లేదా కాంటాక్ట్లెస్ ఫైనాన్స్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ బ్యాంక్ అధికారులను కలవకుండానే లోన్ పొందొచ్చు.బ్యాంకులు డిజిటల్ కేవైసీ విధానాన్ని అనుసరిస్తున్నాయి. వీడియో కేవైసీ, ఆధార్ ఓటీపీ కేవైసీ వంటి ఆప్షన్లను బ్యాంకులు ఇందుకు ఉపయోగించుకుంటున్నాయి. రిజర్వు బ్యాంక్ (RBI) కూడా వీడియో కేవైసీకి అనుమతులు జారీ చేసింది. కరోనా సంక్షోభంలో బ్యాంకులు కస్టమర్లను పొందేందుకు ఈ డిజిటల్ మార్గాలను ఉపయోగించుకుంటున్నాయి. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి బ్యాంకులు ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందిస్తున్నాయి.