విదేశాల నుంచి భారత్కు చేరుకునేవారికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కీలక మార్గదర్శకాలు జారీచేసింది. విదేశాల నుంచి భారత్లో అడుగుపెట్టేవారు 14 రోజులు కచ్చితంగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తొలి ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో, మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలను వెల్లడించింది.