కరోనా విపత్తు వేళ దేశమంతా ఆర్దిక సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరో శుభవార్త చెప్పారు. ప్రస్తుతం కంపెనీలు అమ్మకాల క్షీణత మరియు డిమాండ్ తగ్గింపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో వస్తువుల మరియు సేవల పన్ను (జీఎస్టీ) పై విపత్తు సెస్ విధించడాన్ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ మినహాయింపునిచ్చింది. గత ఏడాది జూన్లో కేరళ ప్రభుత్వం జీఎస్టీ పై విధించిన ఇలాంటి రకమైన విపత్తు సెస్ ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం.