కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు షాక్ తప్పేలా లేదు. మార్చి 13న కేంద్ర కేబినెట్ డియర్నెస్ అలవెన్స్-DA ను 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.14,510 భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు తగ్గిపోయాయి. దీంతో డీఏ అమలును ఆలస్యం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందన్న వార్తలొస్తున్నాయి. దీంతో 1.13 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది బ్యాడ్ న్యూసే. డీఏలో మార్పులు 2020 జనవరి 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అంటే ఏప్రిల్ వేతనం సవరించిన డీఏ ప్రకారం రావాలి. దాంతో పాటు మూడు నెలల బకాయిలు కూడా చెల్లించాలి.