ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ విక్రయాల పై ఆంక్షలు విధించింది. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేనిది మెడికల్ షాపుల్లో ప్రజలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సంజీవనిగా పిలుస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ (సహజంగా దీన్ని మలేరియాను తగ్గించేందుకు వినియోగిస్తారు)పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు. సాధారణ ప్రజలు దీన్ని వాడొద్దనిహెచ్చరించారు. కరోనాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ పని చేస్తుందని చెప్పిన డేటా కూడా సరైనది కాదన్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేనిది హైడ్రాక్సీక్లోరోక్విన్ ను అమ్మవద్దని మెడికల్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్ 19 నోడల్ అధికారి ఆదేశాలు జారీ చేశారు.