ఏపీలో గ్రామ వాలంటీర్ వ్యవస్థకు చాలా మంచి పేరుంది. ఎందుకంటే సర్కార్ అమలు చేసే ప్రతి పథకం అర్హులకు చేరడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి. రేషన్, పింఛన్ నుంచి ఏదైనా సరే వారు ప్రతి ఒక్కరికి అందజేస్తారు. కరోనా వేళ కూడా వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటువంటిది కొందరు చేసిన చిన్న తప్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది. కరోనా వేళ సామాజిక దూరం పాటించాలని సర్కార్ మొత్తుకుంటుంది. విశాఖ జిల్లాలోని ఏటికొప్పాకకు చెందిన ఓ గ్రామ వాలంటీర్ బరర్త్ డే ఉండడంతో మరో 11 మంది గ్రామ వాలంటీర్లు కలిసి సమీపంలోని ఓ మామిడి తోటలో పార్టీ చేసుకున్నారు. వీరు గుంపులుగా కూర్చొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టారు. అవి వైరల్ కావడంతో పోలీసులు వారి పై కేసు నమోదు చేశారు. విశాఖలోని ఏటికొప్పాకకు చెందిన ఓ గ్రామ వాలంటీర్ పుట్టినరోజు కావడంతో మామిడి తోటలో పార్టీ పార్టీ ఇచ్చాడు. తనతో పాటుగా పనిచేస్తున్న 11 మంది గ్రామ వాలంటీర్లు ఈ పార్టీకి హాజరయ్యారు. మామిడి తోటలో ఏర్పాటు చేసిన విందులో వీళ్ళు పాల్గొన్నారు. సామజిక దూరం పాటించలేదు.ఒకచోట గుంపుగా కూర్చొని పార్టీ చేసుకున్నారు. ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భౌతిక దూరం పాటించకుండా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన గ్రామ వాలంటీర్ల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.