ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసిడి ధర పైపైకి... దిగొచ్చిన వెండి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 23, 2020, 12:11 PM

బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. పసిడి ధర ఒక్కసారిగా పైకి కదిలింది. దీంతో పసిడి 4 రోజులుగా తగ్గుదలకు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా మన దేశంలోనూ పసిడి ధర పెరగడం గమనార్హం. మరోవైపు బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గరువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.680 పెరుగుదలతో రూ.44,780కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.650 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,050కు ఎగసింది. పసిడి ధర పెరిగితే.. వెండి ధర పడిపోయింది. కేజీ వెండి ధర రూ.240 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.41,410కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.09 శాతం దిగొచ్చింది. దీంతో ఔన్స్‌కు 1736.40 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదలతో 15.26 డాలర్లకు క్షీణించింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.310 పెరుగుదలతో రూ.42,160కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.44,900కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.240 పడిపోయింది. దీంతో ధర రూ.41,410కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com