ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద ప్రజలకు కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

national |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2020, 02:17 PM

 అత్తిలి  కరోనా వైరస్ కర్ఫ్యూ నేపధ్యంలో పేద ప్రజలేవ్వరూ నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడకూడదనే ఉద్ద్యేశంతో కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్రావు తెలిపారు. నేడు అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామంలో పేద ప్రజలకు కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు ఎమ్మెల్యే కారుమూరి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కరోనా భారిన పడకూడదనే ఉద్ద్యేశంతో సీఎం జగన్ అన్ని శాఖల ముఖ్య అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తూ, పరిస్దితులపై చర్చిస్తున్నారన్నారు. అలానే ప్రజలందరూ ప్రభుత్వ నిభందనలకు సహకరించాలని కోరారు. అత్తిలి శ్రీ వల్లిదేవ సేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దేవాలయం నుండి కమిటి సభ్యులు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సీఎం సహయ నిధికి 1లక్ష రూపాయలు , కళ్యాణ మండపం నుండి మరో 1లక్ష రూపాయలు విరాళాన్ని ఎమ్మెల్యే కారుమూరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మంపాడు వైసిపీ నాయకులు వేగేశ్న ధన సత్యనారాయణ రాజు,రామరాజు తదితరులు పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com