ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలో ముస్సోరీ ఎమ్మెల్యే గణేశ్ జోషి ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఉచితంగా భోజనం పెట్టేందుకు మోదీ పేరిట కిచెన్ను ప్రారంభించారు. దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భవననిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి భోజనం పెట్టేందుకే తాను మోదీ కిచెన్ ను ప్రారంభించామని బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముస్సోరీ నగరంలోని రాజ్ పూర్, జఖాన్, దక్రా, దోవల్ వాలా ప్రాంతాల్లో ప్రతీరోజూ 500మంది పేదలకు ఆహారం పెడుతున్నట్లు పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించాల్సినందున తమ పార్టీ కార్యకర్తలు ఆహారాన్ని ప్రజల ఇళ్ల వద్దకే చేరవేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.