ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం స్కీమ్.. రూ. 2 లక్షల బెనిఫిట్.. ఏయే కారణాలతో డబ్బులు ముందే తీసుకోవచ్చో తెలుసా

business |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 10:39 PM

పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల్ని లాంఛ్ చేసింది. వీటిల్లోనే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కూడా ఒకటని చెప్పొచ్చు. ఇది పెన్షన్ కమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ఇన్వెస్టర్లకు మలి వయసులో ఆర్థికంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. మార్కెట్లతో లింక్ అయి ఉంటుంది. ఇందులో భాగంగా ముందు నుంచి రిటైర్మెంట్ ఫండ్ కోసం డబ్బు ఆదా చేయాల్సి ఉంటుంది. ఇక NPS పెన్షన్ దారులు తమ నిధి (కార్పస్) నుంచి మెచ్యూరిటీకి ముందుగానే 25 శాతం పాక్షికంగా నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు వచ్చింది. ఈ కొత్త రూల్స్ 2024, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనికి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి.


ముందుగా NPS పథకంలో చేరి 3 సంవత్సరాలు అయి ఉండాలి.


NPS పాక్షిక విత్‌డ్రా రూల్స్ ప్రకారం.. చందాదారులు తమ కాంట్రిబ్యూషన్స్ నుంచి గరిష్టంగా 25 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.


PFRDA రూల్స్ ప్రకారం.. తమ జీవిత కాలంలో 3 సార్లు మాత్రమే పాక్షికంగా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.


ఏయే కారణాలకు డబ్బులు తీసుకోవచ్చు?


>> పిల్లల ఉన్నత చదువుల కోసం 25 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. (చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది.)


>> పిల్లలకు పెళ్లి ఖర్చుల కోసం (ఇక్కడ కూడా దత్తత తీసుకున్న వారికి వర్తిస్తుంది)


>> ఇల్లు లేదా ఫ్లాట్ కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం


>> కొన్ని పేర్కొన్న తీవ్ర అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం


>> చందాదారుడు.. వైకల్యానికి గురైన సందర్భంలో వైద్యం, ఇతర ఖర్చుల కోసం


>> స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అవకాశాల కోసం


>> సొంతంగా వెంచర్ లేదా స్టార్టప్స్ ఏర్పాటు చేసేందుకు కూడా డబ్బుల్ని పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.


ఈ పథకం విషయానికి వస్తే ఇది స్వచ్ఛంద, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక అని చెప్పొచ్చు. కనిష్టంగా 18 నుంచి గరిష్టంగా 70 సంవత్సరాల వరకు వయసు ఉన్న ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రవాస భారతీయులకు కూడా ఛాన్స్ ఉంది.


NPS లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 80c కింద గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలోనే రూ .1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు. ఇంకా.. ఈ లిమిట్ దాటిన వారు NPS లో పెట్టుబడి పెట్టడం ద్వారా అదనంగా మరో రూ .50 వేల టాక్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. మరే పథకంలోనూ ఈ బెనిఫిట్ లేదు.


ఇలా రూ. లక్ష పెన్షన్..


పదవీ విరమణ తర్వాత రూ. లక్ష పెన్షన్ అందుకోవాలంటే.. 25 సంవత్సరాలకే అకౌంట్ తెరిచి నెలకు రూ. 8150 చొప్పున ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. రోజుకు రూ. 270 అనుకోండి. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే భారీ ఫండ్ సృష్టించొచ్చు. మీ పెట్టుబడి ఇక్కడ రూ. 34 లక్షల పైచిలుకు అవుతుంది. ఇది మార్కెట్ లింక్డ్ స్కీమ్ కాబట్టి.. 8 శాతం రాబడి లెక్కన చూసుకున్నా.. ఇది రూ. 1.88 కోట్లకు చేరుతుంది. ఇక్కడ యాన్యుటీ కొనుగోలు చేసి నెలకు రూ. లక్ష చొప్పున పెన్షన్ అందుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com