ఈశాన్య ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మౌజ్ పూర్, బ్రహంపూరి ప్రాంతాల్లో మళ్ళీ రాళ్ల దాడులు జరిగాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. నిన్న జరిగిన అల్లర్లతో ఐదుగురు మృతి చెందారు. జాఫ్రాబాద్, మౌజ్ పూర్, బ్రహంపూరి, భజన పుర, యుమనవిహార్ ప్రాంతల్లో అదనపు బలగాలు మోహరించాయి. హింసాత్మక ఘటనలపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య ఢిల్లీ ఎమ్మెల్యే లు అధికారులతో సీఎం కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించారు.