భారత్ లో ట్రంప్ రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం 9.55 కి రాష్ట్రపతి భవన్ కు ట్రంప్ దంపతులు చేరుకోనున్నారు. ఉదయం 10. 45 కి రాజ్ ఘాట్ లో గాంధీజీకి నివాళులర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ట్రంప్, మోదీలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ మోడీ లంచ్ చేయనున్నారు.మ. 2. 55కి యూఎస్ ఎంబసీకి ట్రంప్ చేరుకోనున్నారు. రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటలకు ట్రంప్ దంపతులు యూఎస్ బయల్దేరి వెళ్లనున్నారు.