రాహుల్ రాణించినా.. శ్రేయస్, పాండే మెరుపులు మెరిపించినా.. కొండంత లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచినా ఫలితం లేకపోయింది. గప్టిల్, నికోలస్ ధాటికి పేసర్లు చేతులెత్తేసినా.. చాహల్ అద్భుత బౌలింగ్తో మ్యాచ్పై ఆశలు రేకెత్తించినా.. కడవరకు గ్రాండ్ హోమ్ అజేయంగా నిలబడటంతో భారత్ ఓటమిపాలైంది. ఫలితంగా 31 ఏళ్ల తర్వాత 3-0తో క్లీన్స్వీప్కు గురై చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 1989 తర్వాత మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్లున్న వన్డే సిరీస్లో క్లీన్స్వీప్ అయిన జట్టుగా కోహ్లీసేన అప్రతిష్టను మూటగట్టుకోనుంది. టీ20 సిరీస్లో క్లీన్స్వీప్కు గురైన న్యూజిలాండ్ అంతకంతకు బదులు తీర్చుకుంది.