ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పంటలకు గిట్టుబాటు ధరపై చర్చించాల్సిందిగా పట్టుబట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇది పార్టీ ఆఫీసు కాదని మందలించారు. చంద్రబాబు కల్పించుకోవడంతో స్పీకర్, చంద్రబాబు మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. చంద్రబాబుపైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.