ఏపీ అసెంబ్లీ దగ్గర టీడీపీ నేతలు నిరసనకు దిగారు. రైతులకు గిట్టుబాట ధరలు కల్పించాలని కోరుతూ టీడీపీ నిరసన తెలుపుతోంది. అసెంబ్లీ ఫైర్ స్టేషన్ వద్ద జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్తో పాటు పలువురు తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. ఇక్కడ్నుంచి ర్యాలీగానే అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు వైసీపీ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.