సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి ఈ నెల 11న పిఎస్ఎల్వి-సి 48 రాకెట్ను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి కౌంట్ మంగళవారం మధ్యాహ్నం 4.25 గంటలకు ప్రారంభం కానుంది. ఇది నిరంతరంగా 23 గంటలు కొన సాగనుంది. అనంతరం బుధవారం మధ్యాహ్నం 3.25 గంట లకు రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా భారత్కు చెందిన ఆర్ఐఎస్ఎటి-2బి ఆర్ఐ1 ఉపగ్రహంతోపాటు మరో తొమ్మిది విదేశీ నానో ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. నానో ఉపగ్రహాల్లో ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్కు సంబంధించి ఒక్కటి చొప్పున, ఎఎస్ఎకు చెందిన ఆరు ఉన్నాయి. రెండు వారాల స్వల్ప వ్యవధిలో మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఇది పిఎస్ఎల్వి రాకెట్ల సీరీస్లో 50వ ప్రయోగం. ఈ ఏడాది షార్ నుంచి ఆది ఆరో ప్రయోగమని శాస్త్రవేత్తలు తెలిపారు. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం.