గుంటూరు జిల్లా, చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని సౌజన్యంతో నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ వారి ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించినట్లు ఎడ్లపాడు వైఎస్ఆర్సిపీ నాయకులు విగ్నేశ్వర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కానీ ఇతర మండలాల వారైనా సరే కంటి సమస్యలు ఉన్నవారు ఈ క్యాంపుకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవచ్చనని, ఈ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు