జీఎస్టీ వసూళ్లు నవంబర్ లో లక్ష కోట్ల రూపాయల మార్క్ ను తాకాయి. దేశీయంగా లావాదేవీల నుంచి జీఎస్టీ సేకరణ 12 శాతానికి పెరగడంవల్లనే వసూళ్లు పెరిగినట్లు జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది. గత ఏడాది నవంబర్ తో పోలిస్తే.. గత నెలలో వసూళ్లు 6 శాతం పెరిగాయి. 2018 నవంబర్ లో జీఎస్టీ వసూళ్లు 95 వేల 380 కోట్లుగా ఉన్నాయి.ఈ ఏడాదిలోనే అత్యధికంగా నవంబర్ లో దేశీయ లావాదేవీల నుంచి 12 శాతం జీఎస్టీ వసూళ్లు పెరగటం ఇందుకు కారణంగా పేర్కొంది కేంద్రం.