కొందరు కామాంధులు న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. పోలీసులుఅందించిన వివరాల ప్రకారం నవంబర్ 26న సాయంత్రం 5:30 గంటల సమయంలో ఓ ఎల్ఎల్బీ స్టూడెంట్.. తన స్నేహితురాలితో కలిసి కళాశాల నుంచి బైటకు వస్తున్న సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు గన్పాయింట్లో బెదిరించి ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.
అయితే ఈదుండగులు. కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్లో పెట్రోల్ అయిపోవడంతో.. తమ మిత్రులకు ఫోన్ చేసి కారుని రప్పించుకున్నారు. కారులో వచ్చిన కొందరుతో పాటు వీరిద్దరూ విద్యార్ధినిని బ్రిక్ కిల్న్ ఏరియాకు తీసుకెళ్లారని, అక్కడే బంధించి మొత్తం 12 మంది ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారని పోలీసులు వివరించారు.
ఎవరో వస్తున్న అలికిడి విని ఆమెను అక్కడే వదిలేసిన దుండగులు పారిపోయారు. దాదాపు 5,6గంటల పాటు మగతలో ఉండిపోయిన ఆమె, చివరకి సమీపంలో కనిపించిన వ్యక్తి ఫోన్ ద్వారా తనతో పాటు చదువుకుంఉన్న స్నేహితుడి కి సమాచారం అందించిందని, ఆతని సహకారంతో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిందని రాంచీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని కొన్ని గంటల వ్యవధిలోనే సదరు విద్యార్ధినిని కిడ్నాప్ చేసి రప్ చేసిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. తమ విచారణలో న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి కారు, బైక్, తుపాకీ, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.