రాష్ట్రంలో పలు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కమిషన్ బృందాలు అన్ని జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలల్లో తనిఖీలు జరపనున్నాయి.