పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పొలం నుంచి గడ్డి తీసుకువస్తున్న ట్రాక్టర్ ఒడ్డు దాటుతుండగా బోల్తా పడింది. ప్రమాదంలో పైన కూర్చున్న నలుగురు గడ్డి కింద చిక్కుకుపోయారు. చుట్టుపక్కల రైతులు వచ్చి గడ్డి కింద నుంచి వారిని బయటకు తీసేలోపు ఊపిరి ఆడక ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.