ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ పార్టీలో అందరూ సమానమే‌: నారాయణరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 07:46 PM

టీడీపీ నాయకులు, కార్యకర్తలు  అందరూ సమానమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురంలో టీడీపీ నియోజకవర్గ సమావేశం  కందుల నారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ  సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడారు... వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. ప్రజలకు అండగా తామున్నామనే ధైర్యాన్ని ఇవ్వాలని ఆ పార్టీ నాయకులకు సూచించారు. కలిసి కట్టుగా అందరూ పనిచేస్తే టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగలుగుతుందని....అయితే నిర్లక్ష్యంగా పనిచేస్తే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర పరిశీలకులు లింగారెడ్డి, సుధాకర్, బాబుయాదవ్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి వీరబ్రహం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com