టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమానమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురంలో టీడీపీ నియోజకవర్గ సమావేశం కందుల నారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడారు... వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. ప్రజలకు అండగా తామున్నామనే ధైర్యాన్ని ఇవ్వాలని ఆ పార్టీ నాయకులకు సూచించారు. కలిసి కట్టుగా అందరూ పనిచేస్తే టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగలుగుతుందని....అయితే నిర్లక్ష్యంగా పనిచేస్తే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర పరిశీలకులు లింగారెడ్డి, సుధాకర్, బాబుయాదవ్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి వీరబ్రహం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..