హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం చేయడం పట్ల బిజెపి ధార్మిక సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అనంత శేషగిరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కి బిజెపి శ్రేణులు వినతిపత్రం అందజేశారు. దేవస్థాన ప్రాంగణంలో అన్యమత ప్రచారం చేసిన భజన సంఘానికి అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న ఇతర మతస్తులను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వెంటనే తొలగించాలని కోరారు. సత్య దేవుని దర్శనానికి వచ్చిన భక్తులపై చేయి చేసుకున్న అధికారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు సింగిలిదేవి సత్తిరాజు, చిరుకూరి రామ్ కుమార్ , కామర్సు చిరంజీవి, బి. రామకృష్ణంరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.